డిల్లీ, బతుకమ్మ : డిల్లీలో ఆదివారం అఖిల పక్ష నేతల సమావేశం ముగిసింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేఫథ్యంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. ఈసమావేశంలో 36 పార్టీలు, 50 మంది నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని నేతలను కేంద్రం కోరింది. సభలో 14 కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అణుశక్తి బిల్లు, జాతీయ భద్రత, హెల్త్, ఇన్సూరెన్స్ బిల్లులపై చర్చించనున్నారు. ఓట్ చోరీ, ఢిల్లీ పేలుళ్ల అంశంపై సమావేశాల్లో చర్చించాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.