Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 9:41 pm Posted by : ramakrishna

ధ్యానం తోనే సర్వ రోగాలు, మానసిక ఒత్తిడి దూరం

న్యాచురోపెటిస్ట్, యోగా తెరపిస్ట్ డాక్టర్ ఐశ్వర్య

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  ధ్యానం చేయడం వల్లే సర్వ రోగాలు,మానసిక ఒత్తిడిని దూరం పెట్టవచ్చని న్యాచురోపెటిస్ట్, యోగా టేరపిస్ట్ డాక్టర్ ఐశ్వర్య పేర్కొన్నారు. అంతర్జాతీయ ధ్యానం దినోత్సవం పురస్కరించుకొని  శనివారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోని ఆరోగ్య రక్ష నేచర్ కేర్, యోగ బ్యూటీ కేర్ లో మహిళలకు మీ అనం చేయడం వల్ల ఉపయోగాలు గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో  పని ఒత్తిడి వల్ల చాలామంది అనేక రోగాల బారిన పడి ఆసుపత్రిలో భారీన పడుతున్నారని ఆమె అన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఇంటి పని ఒత్తిడిలో ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలేదనిఆమె అన్నారు. ప్రతిరోజు ఒక అరగంటసేపు ధ్యానానికి సమయం కేటాయిస్తే ఎలాంటి వ్యాధులు తమ దరికి చేరవని ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండవచ్చని ఆమె అన్నారు.

All diseases and mental stress go away with meditation