సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..
జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ యెగా, ప్రకృతి చికిత్స వైద్యురాలు, ఆరోగ్య రక్ష వ్యవస్థాపకురాలు ఐశ్వర్యను డాక్టరేట్ వరించింది. సోమవారం కర్ణాటక రాష్ట్రం గుల్బార్గలోని మెక్సికో యూనివర్సిటీ ఆఫ్ టోలోసా స్నాతకోత్సవం జరిగింది. ఆరోగ్యంపై ఐశ్వర్య చేపట్టిన అవగాహన కార్య క్రమాలను గుర్తించి వర్సిటీ ఆచార్యులు కట్ట బొమ్మన్న, ప్రకాశరావు తదితరులు గౌరవ డాక్ట రేట్ అందజేశారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న ఐశ్వర్యను బుదవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారయణ దంపతులు సన్మానించి సత్కారించారు. యోగా తో పాటు ప్రకృతి చికిత్స వైద్యురాలుగా చేస్తున్న సేవలకు గౌరవ డాక్టరేట్ అందుకున్న ఐశ్వర్య భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదుగాలని ఎమ్మెల్యే అకాంక్షించారు.
