కూలిన ఎయిర్ ఇండియా విమానం
అహ్మదాబాద్, బతుకమ్మ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలింది. మేఘాని లోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలో నివాస ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.