Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 January 2025, 6:29 pm Posted by : ramakrishna

మున్సిపల్ కమిషనర్ ను కలిసిన ఏఐఎంఐఎం నాయకులు

నిజామాబాద్, బతుకమ్మ : ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ వీక్లీ మార్కెట్‌లోని పండ్ల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులతో పాటు ఆదివారం ఏఐఎంఐఎం బృందం మున్సిపల్ కమిషనర్ ను కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు వీక్లీ మార్కెట్ నుండి పేద వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, కూరగాయల విక్రేతలను తొలగించారని తెలిపారు. పేద వ్యాపారులను అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతించాలని ఏఐఎంఐఎం బృందం మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.

AIMIM leaders met the Municipal Commissioner