మహిళలకు ఐద్వా అండగా ఉంటుంది
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ మహిళలకు ఐద్వా అండగా ఉంటుందని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో అఖిలభారత ప్రజాతంత్ర 14 జాతీయ మహాసభల సందర్భంగా ఐద్వా జండా ఆవిష్కరించారు. అలాగే బెలూన్స్ పై ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయండి అని రాసి చిన్నపిల్లలతో ప్రదర్శించంపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం దేశంలో అనేక...