Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 May 2025, 3:25 pm Posted by : ramakrishna

సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్

హైదరాబాద్, బతుకమ్మ : పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేకు వివరించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపారు. మంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించారు.