Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2024, 10:23 am Posted by : ramakrishna

వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

. . . హాస్టల్ లో  ఉరివేసుకురని ఆత్మహత్య…

 బతుకమ్మ, రుద్రూర్Agricultural Polytechnic College student commits suicide

వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని ఉరివేసుకుని అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా  రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో జరిగింది. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం విద్యార్ధిని లింగవాడ్ రక్షిత (15)వసతిగృహం బాత్రూంలో  కిటికి గ్రీల్స్ కు చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు లోకి వచ్చింది.ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థినీలు అధికారులకు సమాచారం ఇచ్చారు.  రకితది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్ గ్రామం. లింగావడ్ రక్షిత ఐదు రోజుల క్రితమే కళాశాల వసతి గృహంలో చేరింది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని రూద్రుర్ సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. రక్షిత తల్లిధండ్రులు రాకముందే అమే డేడ్ బాడిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించడంతో హస్టల్ వద్ధ ఉద్రిక్తత నెలకోంది.