Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 3:51 pm Posted by : ramakrishna

రైతు వేదికల వద్ద ఏఈవోల నిరసన

వేల్పూర్, బతుకమ్మ: క్రాప్ సర్వే బాధ్యత తమతో కాదని, తమకు ఆ పనిని అప్పగించడాన్ని నిరసిస్తూ ఏఈవోలు మంగళవారం రైతువేదికల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తాము రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా  క్రాప్ సర్వే చేయడం లేదని అబ్సెంట్ వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ లో నిర్వహించిన నిరసనలో వ్యవసాయ విస్తీర్ణ అధికారుల జిల్లా అధ్యక్షుడు ఎం భాస్కర్ నాయక్, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు తిరుమల స్నేహ శ్రీ, ప్రశాంత్, షబ్బీర్, సాయిరాం పాల్గొన్నారు.