ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
బతుకమ్మ,మోర్తాడ్: ప్రతి ఇంటిని నాణ్యతతో, ప్రభుత్వం తెలిపిన విధి విధానాల ప్రకారం ఇండ్లను నిర్మించుకోవాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని దొన్ పాల్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. బేస్మెంట్ లెవల్ లో జరుగుతున్న పనులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి దుర్గ తదితరులు పాల్గొన్నారు.