బోధన్ మున్సిపల్ కార్యాలయం తనిఖీ
. . . మైనార్టి రెసిడేన్షియల్ పాఠశాలలో మధ్యహ్న బోజనం పరిశీలన
బోదన్, బతుకమ్మ:
బోదన్ మున్సిపల్ పాలక కమిటీ కాల పరమైతి ముగియడంతో ఉన్నతాధికారుల ఆదేశాలలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, మున్సిపల్ ఉద్యోగులు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతించారు.

అనంతరం అదనపు కలెక్టర్ అంకిత్ బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఉద్యోగులతో రివ్యూ మీటింగ్ లో పలు అంశాల గురించి చర్చించారు. అనంతరం బోధన్ మున్సిపల్ పరిధిలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను, తరగతి గదులను, వంటగదిని, డైనింగ్ హాల్ను పరిశీలించి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.
