నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు : ఎస్సై సాయన్న
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను గురువారం ఎస్సై పి.సాయన్న తనిఖీ నిర్వహించారు. ఎరువుల దుకాణాలలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా సిసి కెమెరాల ప్రాముఖ్యత గురించి వివరించారు. సిబ్బందికి రూల్ కాల్ అవాంఛనీయ సంఘటనలను నియంత్రించడానికి గ్రామ రోడ్ల గుండా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.