. . . జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావార్ రాజేశ్వర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గ్యాస్ కొరత ఉండడంతో ఎల్ పీజీ డొమెస్టిక్ సిలిండర్స్ ని అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ అన్నారు. ఈ విషయంపై నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారులు సివిల్ సప్లై అధికారులు శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ సివిల్ సప్లై అండ్ జిల్లా పౌర సరఫరాల డిసిఎస్ఓ అరవింద్ రెడ్డి లను కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే హోటల్స్, టిఫిన్ సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను కోరారు.