బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : కేజీబీవీ మాక్లూరులో బంగారు గొలుసు పోయిందని విద్యార్థిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన వారిపైన ఇప్పటికీ చర్యలు తీసుకోవాలని కోరుతూ పీ.డీ.ఎస్.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి సోమవార వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ కేజీబీవీ మాక్లూరులో 6వ తరగతి విద్యార్థినిని మంత్రగాడికి దగ్గరికి తీసుకెళ్లిన ఘటనలో ప్రధాన బాధ్యులైన సోషల్ సిఆర్టి గౌతమి రెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో విచారణ జరిగినా ఇప్పటికీ ఆమెపై కనీస చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఘటనకు సంబందంలేని అమాయకులైన ముగ్గురిని బదిలీ చేయడం అన్యాయం అని, తక్షణమే సీఆర్టీ గౌతమిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ. నగర అధ్యక్షులు అషూర్ ,నాయకులు సృజన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.