Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 6:44 pm Posted by : ramakrishna

మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

 

. . . స్పెషల్ ఆఫీసర్ అరవింద్ రెడ్డి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పెషల్ ఆఫీసర్ అరవింద్ రెడ్డి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలను శనివారం స్పెషల్ ఆఫీసర్ అరవింద్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులతో పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పలు విషయాల పై చర్చించారు. ఆయన వెంట ఎంఈఓ రామ్ సింగ్, ఎంపీడీవో బాల గంగాధర్, ఎంపీఓ అరవింద్, పంచాయతీ సెక్రెటరీ ప్రేమ్ దాస్  తదితరులు ఉన్నారు.