సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియ
తేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం లో అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య ఆధ్వర్యంలో ఎంపవరింగ్ ఇండియా 2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ” అనే అంశం పై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు కు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 1992 లో 178 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు...