తేయూలో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించిన రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ లో గురువారం బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించినారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి కి మూలం బతుకమ్మ పండుగ ఒకటి అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ బతుకు నిస్తుందని బలంగా నమ్ముతారన్నారు. తెలంగాణ ప్రాంతంలో గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు బొడ్డెమ్మ పండగను పెళ్లి కానీ ఆడపిల్లలు 9 రోజులు ఆడతారని మొదటి రోజు...