Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2025, 4:56 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు నివాస గుడిసె దగ్ధం

  • మూడు  లక్షలు ఆస్తి నష్టం

 

సదాశివనగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో రెండు నివాస గుడిసెలు ప్రమాదవశాత్తు దగ్ధం అయిందని స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంగయ్యడ రాజశేఖర్, సంగయ్యడ భాస్కర్ కు చెందిన నివాస గుడిసెలు దగ్దమయ్యాయని తెలిపారు. సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం

Accidental residential hut fire

వాటిల్లిందని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి వారికి నివాస గృహాలు కల్పించాలని వారికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు. ఈ ప్రమాదంలో  వంటసామాగ్రి,  బట్టలు వివిధ వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

Accidental residential hut fire