నేషనల్ హైవేపై ప్రమాదం

. ఇద్దరికి తీవ్రగాయాలు? ఇందల్వాయి, బతుకమ్మ: జాతీయ రహదారి 44పై చాంద్రయాన్ పల్లి రెండు కార్లు ఢీకొన్నాయి. ఓ కారు రెయిలింగ్ పైకి దూసుకెళ్లగా, రెండో కారు మొదటి కారును ఢీకొట్టింది. ఇద్దరికి తీవ్రగాయాలుకాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.  ప్రమాదసమయంలో భారీ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ముగ్గురు, హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న కారులో ఇద్దరు ఉన్నారు.