వెబ్ న్యూస్,బతుకమ్మ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి తహసీల్ కార్యాలయంలో సోమవారం గ్రామపరిపాలన అధికారి (వీఏవో) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గ్రామ పరిపాలన అధికారి బానోత్ శ్రీను నాయక్ పూసుగూడెంకు చెందిన ఓ వ్యక్తి భూమి రిజిస్ర్టేషన్ కు సంబంధించి మొత్తం రూ. 60 వేలు డిమండ్ చేశారు. ఇదివరకే రూ. 40 వేలు తీసుకున్న శ్రీను నాయక్ సోమవారం రూ. 15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ములకల పల్లి తహసీల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.