Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 7:55 pm Posted by : ramakrishna

అసెంబ్లీ ముట్టడి కి ఏబీవీపి యత్నం

 

. . .గేట్లు వద్ద ఏబీవీపీ నేతలను అడ్డుకున్న పోలీస్ లు

హైదరాబాద్, బతుకమ్మ : 

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి దిగారు. అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి ముందస్తు అరెస్టులు చేసినా వెనక్కి తగ్గని వందలాది కార్యకర్తలు దఫాలవారీగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. శనివారం అసెంబ్లీ చివరి రోజున ముట్టడికి యత్నించిన ఏబీవీపీ నాయకులు, కార్యాకర్తలను గేట్ వద్ద నిలువరించి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులు ఆపలేవు నిర్బంధాలు అడ్డుకోలేవు! విద్యార్థుల హక్కుల కోసం ఏబీవీపీ పోరాటం కొనసాగుతుంది అని పరిషత్ నాయకులు అన్నారు.