ముంబై సముద్రంలో కొట్టుకుపోయి మెదక్ జిల్లా యువకుడు మృతి

విషాదాన్ని మిగిల్చిన బోటు ప్రయాణం సరదా వెబ్ న్యూస్, బతుకమ్మ : ముంబై సముద్రంలో కొట్టుకుపోయి మెదక్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.  కుటుంబంతో సరదాగా సముద్రంలో బోటు ప్రయాణం చేసి, ఒడ్డుకు రాగానే అలల దాటికి యువకుడు కొట్టుకుపోయాడు. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న టంకరి రాము (34) అనే యువకుడు, ముంబై సముద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకున్నాడు. బోటు దిగిన వెంటనే నీటి అలలు వేగంగా రావడంతో సముద్రంలోకి...