రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

బతుకమ్మ,మెండోరా :  రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..  నిర్మల్-దిల్వాల్ పూర్ సమీపంలో సోమవారం రాత్రి ఆటోను లారీ ఢీకొంది. ఈప్రమాదంలో మెండోరా మండల కేంద్రానికి చెందిన గంగు తీవ్రంగా గాయపడింది. నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించే క్రమంలో గంగు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.