Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 3:49 pm Posted by : ramakrishna

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు హెలీ ప్యాడ్ వద్ద టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీజీఆర్ఈఎస్ఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమన్ రెడ్డి, ప్రశాంత్, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, మచ్చుకూరి సతీశ్, జిల్లా ఉపాధ్యక్షులు సంజీవయ్య , అర్బన్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, పార్థసారథి, ఆర్మూర్, భీమ్ గల్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, టీఎన్జీవో సలహాదారు వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.