సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రిబాయి పూలే 195వ జయంతిని శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ మహానీయుల పార్కులో గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ స్త్రీలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆడబిడ్డలకు చదువు నేర్పిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని పేర్కొన్నారు. దాదాపు 52...