బాన్సువాడ, బతుకమ్మ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా ఎన్నికైన కాదెపురం గంగన్నను ఆదివారం బీర్కూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లు ఘనంగా సన్మానించారు. ఓ మండల స్థాయి రిపోర్టర్ గా పనిచేస్తూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, రవికుమార్, పండరి, గంగాధర్, రామకోటి, గణేష్, భవాని, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.