ఆత్మీయ సమ్మేళనం
బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలోని దూదిగాం సిఎస్ఐ పాఠశాలలో 1994-95వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం సోమవారం దూదిగంలో నిర్వహించారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి మిత్రులు అప్పటి జ్ఞాపకాలను ఒక్కసారిగా నెమరు వేసుకున్నారు. సంతోషంతో ఒకరినొకరు పలకరించుకొని ప్రేమ ఆప్యాయతలు పంచుకున్నారు. వారికి చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.