Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 12:53 pm Posted by : ramakrishna

ఆప్ పార్టీకి ఎదురుదెబ్బ.. కేజ్రీవాల్ ఓటమి

డిల్లీ, బతుకమ్మ:  డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇచ్చాయి. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్  న్యూడిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. అలాగే జంగ్ పుర నియోజక వర్గం నుంచి మనీష్ సిసోదియా ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు. కాల్ కాజీ స్థానం నుంచి డిల్లీ సీఎం అతిశీ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 36ను దాటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళుతుంది. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ ఓటమితో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఆప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.