హైవేల కండిషన్‌పై నివేదిక ఇవ్వాలి

ఢిల్లీ, బతుకమ్మ :  జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణకు  స్వీకరించింది.  రాజస్థాన్‌, తెలంగాణలో జరిగిన ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని NHIA, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని,  హైవేల కండిషన్‌పై నివేదిక ఇవ్వాలని సూచించింది. మెయింటెనెన్స్‌ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.