Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2025, 6:20 pm Posted by : ramakrishna

యశోదలో అరుదైన శస్త్ర చికిత్స

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సికింద్రాబాద్ యశోద  హాస్సిటల్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స విజయవంగంగా పూర్తి చేశారు. అసాధారణమైన ట్యూమర్ తో బాధపడుతున్న రోగికి శస్త్ర చికిత్స చేసి నమ్మశక్యంకాని ఫలితాన్ని రాబట్టారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లికి చెందిన ఫర్జానా బేగం(52) అనే మహిళ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతు సికింద్రాబాద్ లోని యశోద  హాస్పిటల్ కు వచ్చింది. దీంతో ఆమెకు ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించి పెద్ద పిట్యుటరీ ట్యూమర్ గుర్తించారు. శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్ ను ట్రాన్స్ ఎండోస్కోపిక్, ట్రాన్స్ నాజల్ పద్దతిలో పూర్తిగా తొలగించామని తెలిపారు.