Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2024, 3:51 pm Posted by : ramakrishna

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ :  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నగరంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ తో కలిసి నగరంలోని స్మశాన వాటికల కోసం పర్యటించారు. అయితే కంఠేశ్వర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ ప్రమాదకరంగా ఒకరి ఇంటి పక్కనే ఉన్న పెద్ద డ్రైనేజీ ని చూసి వారి ఇంటికి వెళ్లి ఇంటి యజమానులతో మాట్లాడారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇంటి పక్కనే ఉన్న ఇంత పెద్ద డ్రైనేజీతో ఇబ్బంది పడడం లేదా..? ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు ఎప్పుడైనా తెలియజేశారు అని వారిని ప్రశ్నించారు. వెంటనే మున్సిపల్ కార్యాలయానికి వచ్చి పెద్దగా ఉన్న డ్రైనేజీకి మరమ్మత్తులు చేయించేలా అలాగే వాటి మీద స్లాపింగ్ చేయించేలా అధికారులతో మాట్లాడి పని చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.