కారును ఢీకొన్న లారీ

ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం   ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి - నాగిరెడ్డిపేట రహదారి  పెద్దారెడ్డి పెట్రోల్ పంపు  క్రాసింగ్ రోడ్డు వద్ద శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో కారును లారీ ఢీకొట్టడంతో నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి తాండకు చెందిన పూల్ సింగ్ కుటుంబ సభ్యులతో వెళుతుండగా  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ చేస్తున్న పూల్ సింగ్  అక్కడికక్కడే మృతి చెందగా అతని కుటుంబీకులు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగ ఉన్నట్లు తెలుస్తోంది.