Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 10:26 am Posted by : ramakrishna

వడ్ల లోడ్ తో వెలుతున్న లారీ బోల్తా

 

 సదాశివ నగర్, బతుకమ్మ:

వడ్ల లోడ్ తో వెలుతున్న లారీ తాత్కలిక బ్రిడ్జీపై బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ , క్లీనర్ లకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన అదివారం రాత్రి  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గంగమ్మ వాగు  వద్ధ జరిగింది. గంగమ్మ వాగు వద్ద  బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వలన  తాత్కాలిక రోడ్డు  వేసిన ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకపోయింది. రామారెడ్డి గ్రామ ప్రజలు వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు  అంబాయి ప్రసాద్ ఆధ్వర్యంలో  తాత్కలిక రోడ్డు నిర్మించుకుని రాకపోకలు సాగిస్తున్నారు.  అ రోడ్డుపై టూ వీలర్ త్రీ వీలర్ మాత్రమే వెళ్లడం జరుగుతుంది  అదివారం రాత్రి వడ్ల లోడ్ లారీ రోడ్డు సరిగా లేక బోల్తా పడింది . అదికారులు స్పందించి కోత్తగా రోడ్డు , బ్రిడ్జీ నిర్మాణం చేయాలని  చుట్టుముట్టు గ్రామాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని  గ్రామస్థులు కొరుతున్నారు.  రోడ్డు పనులు పనులను వెంటనే జరుపాలని లేకపోతే జేఏసీగా ఏర్పడి పెద్ద ధర్నా కార్యక్రమాలు చేస్తామని   గ్రామస్థులు అంటున్నారు.

A lorry carrying a load of wood overturned