పకడ్బందీగా ఇంటింటి సర్వే చేపట్టాలి

బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి  బాన్సువాడ , బతుకమ్మ : ఇంటింటి సర్వేను ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సూచించారు. బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సర్వే సిబ్బందికి నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజు, ఎంపీడీవో బషీరుద్దీన్‌, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి, ఎంఈవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.