Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 5:28 pm Posted by : ramakrishna

సమాజంలో సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహా యోధుడు

 

. . . అసమానతలను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి జ్యోతిబా ఫూలే

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాయోధుడు, మహిళా అక్షరాస్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జ్యోతి బా పూలే జయంతి ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళల కోసం సతీమణి సావిత్రి భాయి పూలే తో కలిసి మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

 

A great warrior who dedicated his life for equality in society

 

ప్రధానంగా మహిళల విద్యకు ఆయన చేసిన సేవలు అపూర్వమైనవని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంతో సత్యశోధ కు సమాజాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ఒక మహానుభావుడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం అందరి బాధ్యత అన్నారు. ప్రధాని మోదీ కూడా మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతుందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక రూపొందించకుండా మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కార్పొరేటర్లు జ్యోతి మురళి, మల్లేష్ యాదవ్, బెల్లాల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

A great warrior who dedicated his life for equality in society