ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం
ప్రభుత్వ పనులకు టీజీ ఎండీసీ నుంచే ఇసుక సరఫరా మైనర్ మినరల్స్ బ్లాక్ల వేలానికి టెండర్లు పిలవండి గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ: ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు. గనుల శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ...