పాస్టర్ ప్రవీణ్ కు క్యాండిల్ తో ఘన నివాళి

నిజామాబాద్ , బతుకమ్మ : నగరంలో క్రిస్టియన్లు ఇటీవల రాజమండ్రిలో హత్యకు గురైన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం నిజామాబాద్  క్రిస్టియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో క్రైస్తవులు క్యాండిల్ వెలిగించి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎస్ ఐ చర్చి ప్రతినిధులు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.