Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 3:02 pm Posted by : ramakrishna

ఊరుస్తున్న పాఠశాల

రుద్రూర్, బతుకమ్మ : గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ గాంధీ పాఠశాల ఊరుస్తుంది. ఈ పాఠశాలకు మన ఊరు.. మన బడి కింద రెండేళ్ల క్రితం రూ.11.84 లక్షలు మౌలిక వసతుల కల్పన పనుల కొరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాఠశాల పై కప్పు భాగానికి క్యూరింగ్ సరిగ్గా చేయకపోవడంతో తరగతి గదులు, వంట గది మొత్తం కురిసిన వర్షానికి ఊరుస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆరోపించారు. కురుస్తున్న వర్షానికి తరగతి గదులు  ఊరుస్తుండడంతో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.    అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎం కోరారు.


A busy school


A busy school