Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 6:30 pm Posted by : ramakrishna

ఆకతాయి బైండోవర్

బతుకమ్మ, మాచారెడ్డి: మద్యం సేవించి డయల్ 100 కి ఫోన్ చేసే ఆకతాయి ని మాచారెడ్డి తహశీల్దార్ ఎదుట పోలీసులు శనివారం బైండోవర్ చేశారు. బానోతు రమేష్ అనే వ్యక్తి అనవసరంగా 100 కు ఫోన్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేస్తున్నందున మొదటి తప్పు గా భావించి మాచారెడ్డి తాసిల్దార్ శ్వేత ఎదుట బైండోవర్ చేశారు. అనవసరంగా మద్యం తాగి 100 డయల్ కి ఎవరైనా కాల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసినట్లయితే చట్టపరమైన చర్య తీసుకుంటామని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.