27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బాబన్సా పహాడ్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్ టీం దాడులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 152 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబన్సా పహాడ్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్ టీం అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 152 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, సంబంధిత కేసు పత్రాలు, నిందితుడిని తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం నిజామాబాద్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.

More articles

Latest article