నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని గుపన్ పల్లిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ టీచర్ పై కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. మాక్లూర్ మండలం బోర్గాం (కే) చెందిన నాశేట్టి హెమంత్ శ్రీటెక్నో స్కూల్ లో పదవ తరగతి డే స్కాలర్ గా చదువుతున్నాడు. మంగళవారం పాఠశాల తరగతి గదిలో నాశేట్టి హేమంత్ పై రవింధర్ అనే కేమిస్ట్రీ టిచర్ దాడి చేశాడు. ఈ ఘటనలో హేమంత్ చేయి విరగడంతో అతని తండ్రి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
