నందిపేట్, బతుకమ్మ :నందిపేట్ మండల కేంద్రంలోని వెల్మల్ లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిజామాబాద్ నూతన డీసీసీ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియలో భాగంగా బ్లాక్ బి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం చేకూరె అంశాలు బూత్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, బ్లాక్ అద్యక్షులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలని తెలుసుకొని పార్టీ బలోపేతానికి పలు సూచనలు చేసారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు మంద మహిపాల్, డొంకేశ్వర మండల అధ్యక్షులు భూమేశ్వర్ రెడ్డి, మాక్లూర్ మండల అధ్యక్షులు రవి ప్రకాష్, ముఖ్య నాయకులు, బూత్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, బ్లాక్ అద్యక్షులు, మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

