అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందజేసిన డీజీపీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ టౌన్ వన్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఆఫీసర్లలో తెలంగాణలో రెండవ స్థానంలో నిలిచింది. టౌన్ వన్ నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్ ఎ .రజిని (పిసి 2452) పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం నందు (సీసీటీఎన్ ఎస్) అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.

జులై, ఆగస్టు నెల నందు బెస్ట్ ప్రోఫార్మర్ గా నిలిచింది. ఇందుకుగాను బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర డిజిపి జితేందర్ చేతుల మీదుగా రజనీ అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఆఫీసర్లలో నిజామాబాద్ వన్ టౌన్ కు రెండో స్థానంలో నిలవడం పట్ల నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఒకటో టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు అభినందనలు తెలిపారు.

