28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రామలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద గల రామేశ్వర ఆలయంలో  శ్రావణమాసం సందర్భంగా మొదటి సోమవారం భక్తులు పోట్టెత్తారు. ఆలయ అర్చకులు గంగాధర్ జోషి పంతులు ఆధ్వర్యంలో అన్న పూజ, ఆకుల పూజ నిర్వహించారు. మొదటి సోమవారం అయినందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ భోళా శంకరుని  దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేటి అన్నా ప్రసాద కార్యక్రమాన్ని దాతలు పిట్లం మండల కేంద్రానికి చెందిన  వడ్ల కళావతి అంజయ్య దంపతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Devotees flock to Ramalingeswara temple

More articles

Latest article