రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో ఆదివారం సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. మెయిన్ రోడ్డు నుండి శ్రీ బసవేశ్వర మందిరం వరకు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సులేమాన్ నగర్ గ్రామ పెద్దలు దస్తగిరి, మాజీ సదర్ లతీఫ్, మాజీ సర్పంచ్ ఖాదర్, ఆరిఫ్, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
