నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెటివ్ కమిటీ సభ్యునిగా సీనియర్ న్యాయవాది రావులపల్లి జగదీశ్వర్ రావు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాదు రైల్వే జంక్షన్ భవిష్యత్ లో ఉత్తర భారతనికి వారధి కాబోతుందని అన్నారు. ప్రయాణికుల, వ్యాపారస్తుల సమస్యలను రైల్వే స్టేషన్లలో సౌకర్యల విషయమై సలహాలు ఇస్తే పరిగణలోకి తీసికొని అమలు చేస్తామని తెలిపారు. జోన్లోని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకొనే వ్యాపారస్థుల ఇబ్బందులు, కావలసిన సౌకర్యాలు తనకు తెలియచేయాలనీ తాను సౌతసెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, బోర్డు వారికి నివేదించి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ప్రజలు విరివిగా ఈ సౌకర్యాన్ని వినియోగిచుకోవాలని కోరారు.
