బతుకమ్మ, మెండోరా:మెండోరా మండలం వెల్కటూరు గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై నారాయణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం వ్యవసాయ భూమిని చదును చేయడానికి వెళ్లే మార్గ మధ్యలో ఒక సారిగా ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కర్రె బోయిన శ్రీనివాస్ (27) అక్కడికి అక్కడే మృతి చెందాడు. అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
