బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామ క్షేత్ర సహాయకుడు హనుమాడ్లను గురువారం మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి శాలువ కప్పి సత్కరించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎక్కువమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. జిల్లాస్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఏపీవో శకుంతల, ఈజీఎస్ సిబ్బంది టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
