బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం భాగంలో పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని మండల విద్యాధికారి రాజగంగారెడ్డి అన్నారు. తల్లి వృక్షం పూజ కార్యక్రమంలో సిజిఆర్ చైర్ పర్సన్ లీలా కృష్ణారెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి పర్యావరణ పరిరక్షణ బాధ్యత పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ పిడి నరసింహారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
