Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 8:08 pm Posted by : ramakrishna

గడిచిన వారం రోజులలో 97 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు

 

. . . రూ.9,40,000/- జరిమానా విధించిన సంబంధిత కోర్టులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో 97 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయనన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 2 నుండి 6 వరకు నిర్వహించిన వాహన తనిఖీలలో మొత్తం 97 కేసుల నమోదు చేసినట్టు తెలిపారు. వీరినందర్నీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా 94 మందికి కోర్టు లో హాజరు పరచగా   వీరికి రూ: 9,40,000/- జరిమానా విధించడం జరిగిందన్నారు. ఇందులో ముగ్గురుకి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని తెలియజేశారు. అలాగే ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరని ఆయన కోరారు.